36.2 C
Hyderabad
April 27, 2024 19: 20 PM
Slider కృష్ణ

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

#rajendraprasad

గన్నవరం ఘటనలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నిన్న బెయిల్ పై విడుదలైన తోట్లవల్లూరులోని గురుమూర్తి ఇంటికి వెళ్లిన తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ఆయనను పరామర్శించారు. గన్నవరం లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై వైసీపీ రౌడీలు దాడులు చేస్తే పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసులు పెట్టారు.

వైసీపీ గుండాల దాడులను ఖండించి, ధ్వంసమైన ఆఫీస్ పరిశీలనకు వెళ్లిన వీరంకి గురుమూర్తి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులపై ఈ వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే తిరిగి నిన్న బెయిల్ పై విడుదల కావడంపై బాబు రాజేంద్రప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వైసిపి రౌడీ మూకల దౌర్జన్యాలను, దాడులను ప్రజలంతా గమనిస్తున్నారని, మీ వైసిపి వాళ్లే మా ఆఫీస్ ని, వాహనాలను ధ్వంసం చేసి, తిరిగి మా నాయకుల పైనే అక్రమ కేసులు పెట్టి రిమాండ్ పై జైలుకు పంపించడం దారుణమని, అన్యాయంగా అరెస్టయిన మా నాయకులకు బెయిలు మంజూరు చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెదేపా బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, పదో వార్డు కౌన్సిలర్ పాల్యాల శ్రీనివాస్, వల్లూరి కిరణ్, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చౌటుపల్లి భాగ్యరాజ్, చలపాటి శ్రీను,కటారి తిరుపతిరావు, కర్నాటి అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూలై 6న ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Satyam NEWS

నాజా జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవిని సన్మానించిన పెబ్బేరు విలేఖరులు

Satyam NEWS

అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలను తల్లి లాగా చూసుకోవాలి

Satyam NEWS

Leave a Comment