30.7 C
Hyderabad
April 29, 2024 04: 46 AM
Slider కడప

ట్రాన్స్ఫర్: టీచర్ గంగయ్య సేవలు ప్రశంసనీయం

gangaiah

కడప జిల్లా రాజంపేట మండలంలోని కొత్త బోయినపల్లె యస్.జె.యస్. యం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు గంగయ్య సేవలు ప్రశంసనీయం అని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు. గంగయ్య బదిలీ సందర్భంగా సన్మాన కార్యక్రమం నేడు పాఠశాల ప్రాంగణంలో జరిగింది.

ఒకచోట పనిచేసిన ఉపాధ్యాయులు మరో చోటకు బదిలీ అయినప్పుడు వారి అత్యుత్తమ బోధన గుర్తుకు వస్తుందని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, బాలబాలికలు శాలువా,పూలదండలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు షఫీ, శారదా, ప్రసాద్ బలరామయ్య, చంద్రశేఖర్, రమణారెడ్డి, రామరాజు, కృష్ణానాయక్, దార్ల శ్రీనివాసులు ఆచారి, శ్రీలత, తులసి, భానుమతి, లక్షుమ్మ, సుధామయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెరాసలో చేరిన ఖమ్మం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

Satyam NEWS

క్లారిటీ: రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు

Satyam NEWS

అమ్మాయిలు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

Satyam NEWS

Leave a Comment