విజయనగరం పురపాలకసంఘం కాస్త నగర పాలకసంస్థగా ఎదిగినా…యంత్రాంగం వ్యవస్థలో మాత్రం ఇసుమంతైనా మార్పురాలేదు. ఓ మైనార్టీ నేత,అదీబీజేపీ జిల్లా మైనార్టీ అధ్యక్షునిపై దాడి జరిగిన అనంతరం డెయిల్ 100కు దాంతో పాటు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడమే అందుకు నిదర్శనం. సాక్షాత్ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీజిల్లా అధ్యక్షురాలు మీడియా సమావేశం పెట్టి చెబితేగాని దాడి జరిగిన విషయం ఎవ్వరికీ తెలియరాలేదు.
ఓ వక్ఫ్ భూమి విషయంలో బాదితునికి చెందాల్సిన అంశంపై అడ్డుకున్నందకు…పార్టీ మైనార్టీ అధ్యక్షుడు బిలాల్ అహ్మమద్ పై అదేమైనార్టీ వర్గంకు చెందిన కొందరు దాడి చేసారన్నది పార్టీ వాదన.ఏదైనా దాడి జరిగిందన్న ఫిర్యాదు చేసినా పోలీసులెవ్వరూ స్పందించలేదని పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రశాంతకు,విద్యకు,కళలకు పుట్టినిల్లు అయిన విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి అదీమైనార్టీ నేత పైదాడి చేయడం దుర్మార్గమన్నారు. ఇంటలిజెన్స్ అసలు ఉందా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ప్రశ్నించారు.ఈ సమావేశంలో తీగెల హరనాధ్ తదితర పార్టీనేతలు ఉన్నారు.