తీన్మార్ మల్లన్న టీం నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ సతీష్ నాగర్ కర్నూల్ జిల్లాలో తీన్మార్ మల్లన్న టీం బలోపేతానికి గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ సతీష్,కో కన్వీనర్ రాణి పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్ నాయక్ ఆదేశాలతో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ స్థాయి నుండి నియోజక వర్గ స్థాయిలో తీన్మార్ మల్లన్న 7200టీం బలోపేతానికి జిల్లా కన్వీనర్ సతీష్ గోరంట్ల,కో కన్వీనర్ రాణి ఆధ్వర్యంలో జిల్లా టీం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల నుండి టీం సభ్యులు హాజరయ్యారు.టీం బలోపేతానికి నూతన గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీ వేశారు. టీం సభ్యులను సెలెక్ట్ చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గస్థాయిలో రాజేష్ నాయక్, నరసింహ, శ్రీశైలం, భానుప్రకాష్, బాల కురుమయ్య లను ఎంపికచేశారు.
కల్వకుర్తి నియోజకవర్గం నుండి కన్వీనర్ నిరంజన్, కో కన్వీనర్ నరేష్, రాథోడ్, మండల కమిటీ రాజు, రమేష్, రాజు, రవితేజ ఎంపిక చేశారు.అనంతరం జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడారు. జిల్లా పరిధిలో తీన్మార్ మల్లన్న టీం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఖచ్చితంగా సమిష్టి కృషితో గ్రామ స్థాయి, మండల స్థాయి, కమిటీలను ఏర్పాటు చేసి టీం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నుకున్న కమిటీని రాష్ట్రస్థాయి సభ్యులు రాం నాయక్ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
సెలెక్ట్ అయిన కమిటీ సభ్యులు మాట్లాడారు. టీం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ లకు కృతజ్ఞతలు తెలిపారు