తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చునూరి కిషన్, కుంభం శ్రీనివాస్ హైదరాబాద్ లో తీన్మార్ మల్లన్న నివాసం లో వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం, పోటీ పరీక్షల పేపర్ లీకేజీ, రైతుల వడగండ్ల వానలతో ఇబ్బందులు వింటన్నిటిపై ప్రజల ఆలోచనా విధానం మారాలని ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కి జైల్లో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ పిరికిపద చర్య అన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా ప్రశ్నించే గొంతుకలను అణగద్రొక్కడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అని అన్నారు. అలాగే 60 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, సబ్బండ వర్గాల ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని, తొమ్మిది యేళ్ళ నియంత, రాచరిక, నయవంచన, కుటుంబ పాలనను అంతం చేయడానికి ఒక క్షణం పట్టదని అన్నారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న-7200 టీం సభ్యులు, శ్రీకాంత్ రెడ్డి, మార్త శ్రీనివాస్, వెంకన్న, తీన్మార్ మల్లన్న అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.