30.7 C
Hyderabad
April 29, 2024 04: 06 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఎన్నిక

#telanganadandora

తెలంగాణ దండోరా ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ పార్లమెంటు కో-ఆర్డినేటర్ మంతటీ గోపి మాదిగ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండడమే  తెలంగాణ దండోరా లక్ష్యమని తెలిపారు. తెలంగాణ దండోరా నాయకులు సైనికులు లాగా పని చేసి పేద ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీసాల రాము  మాదిగ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  సమావేశం అనంతరం నాగర్ కర్నూల్  జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ  గౌరవ అధ్యక్షులుగా దేవని కుమార్ మాదిగ, జిల్లా అధ్యక్షులు గా దర్శనాల సాయి కుమార్ మాదిగ,  ఉపాధ్యక్షులు గా పాదాల హుస్సేన్, కార్యదర్శిగా లక్ష్మణ్, సహాయ కార్యదర్శిగా జమదగ్ని,  మారో 15 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణ దండోరా సాంస్కృతిక విభాగం జిల్లా కోఆర్డినేటర్ గా డప్పు రవీందర్, తెలంగాణ దండోరా మహిళా విభాగం జిల్లా అధ్యక్షులుగా బాకీ రేణుక, తెలంగాణ దండోరా విద్యార్థి  విభాగం జిల్లా కన్వీనర్ ఎత్తం శివ కుమార్ మాదిగ,

 కో కన్వీనర్ నాగరాజు మాదిగ లను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన దర్శనాల సాయి కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవులు ఇచ్చిన మీసాల రాము మాదిగ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళిత, బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ దండోరా పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులు తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

Satyam NEWS

ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న ఆసుపత్రి సీజ్

Satyam NEWS

అమ‌రాతిలో “బిగ్ డిబేట్ “: అశోకుడి స్థానంలో గీత‌….!

Satyam NEWS

Leave a Comment