28.7 C
Hyderabad
April 26, 2024 10: 19 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ కు సన్మానం

#tourisum

తెలంగాణ రాష్ట్ర పర్యాటక  అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఏఎస్ రావు నగర్ లో సైనిక్ పురి కాలనీ లోనీ ఆదివారం బాలాజీ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ను దేవాలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి  ఘనంగా శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం టూరిజం అభివృద్ధి లో ముందంజలో ఉందని అభివృద్ధి  చేయడం వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ని సన్మానించిన వారిలో ఎస్ రావు నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి , బాలాజీ టెంపుల్ ప్రెసిడెంట్ కాసం వెంకట హరి,IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, IVF స్టేట్ సెక్రటరీ పెద్ది శ్రీనివాస్, IVF మేడ్చల్  ప్రెసిడెంట్ భువనగిరి శ్రీనివాస్, IVF ట్రెసరర్ తాటి శ్రీనివాస్ గుప్త, వైస్ ప్రెసిడెంట్ శంభో పాండయ్య, కందుకూరి నాగేశ్వర్ రావు, మురళీ,ప్రసాద్ రావు. లక్ష్మన , కందటి శ్రీనివాస్,గజ్జెల రమేష్ దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

చిలకలూరిపేట తహసీల్దార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన సుజాత

Satyam NEWS

మంత్రి మల్లారెడ్డి జన్మదినం జరిపిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment