తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఏఎస్ రావు నగర్ లో సైనిక్ పురి కాలనీ లోనీ ఆదివారం బాలాజీ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ను దేవాలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం టూరిజం అభివృద్ధి లో ముందంజలో ఉందని అభివృద్ధి చేయడం వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ని సన్మానించిన వారిలో ఎస్ రావు నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి , బాలాజీ టెంపుల్ ప్రెసిడెంట్ కాసం వెంకట హరి,IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, IVF స్టేట్ సెక్రటరీ పెద్ది శ్రీనివాస్, IVF మేడ్చల్ ప్రెసిడెంట్ భువనగిరి శ్రీనివాస్, IVF ట్రెసరర్ తాటి శ్రీనివాస్ గుప్త, వైస్ ప్రెసిడెంట్ శంభో పాండయ్య, కందుకూరి నాగేశ్వర్ రావు, మురళీ,ప్రసాద్ రావు. లక్ష్మన , కందటి శ్రీనివాస్,గజ్జెల రమేష్ దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.