ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రాష్ట్రం లో ఎక్కడే కాని అభివృద్ధి జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజలు నమ్మి అభివృద్ధి చేస్తారు అని ఓట్లు వేస్తే, అభివృద్ధి పక్కన పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
కులాలను విడగొట్టి కులాల పరంగా రాజకీయ పదవులు ఇస్తే అందరూ సర్దుకుపోతారని, కేవలం అరకొరగా సంక్షేమ పథకాలను ఇస్తే ఓట్లు వేస్తారని ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఆలోచన తీరు సరికాదని విమర్శించారు. అధికారం ఉంది కదా అని పొలీస్ సపోర్టు తో ప్రతిపక్షం గొంతు నొక్కితే సరిపోతుంది అని ఆలోచన తో ఈ ప్రభుత్వం పని చేస్తున్నదని అని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం తాటాకు చప్పడికి భయపడే రోజులు లేవు అని అన్నారు. వృద్దులకు, వితంతువుల కు గతం టీడీపీ ప్రభుత్వం అర్హులందరికి పింఛన్లు ఇస్తే, ఈ వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే వారి పింఛన్లు తీసేసి వారి కడుపు కొట్టారని మండిపడ్డారు.
కరెంట్ చార్జీలు అధికంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకుతింటున్నారని వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. కడప జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా కడప జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమానికి ఒక రూపాయి ఖర్చు చేసారా అని సూటిగా ప్రశ్నించారు.
ప్రతి రోజు సొంత పేపర్లో, సొంత టీవీలో ప్రజల సొమ్ము కోట్లు ఖర్చుచేసి యాడ్స్ ఇచ్చుకుంటూ లేని పబ్లిసిటీ చేసుకుంటూ ప్రతిపక్షాన్ని తిట్టడం పనిగా పెట్టుకున్నారు కాని రాష్ట్రానికి ఒక చిన్న పరిశ్రమ అయిన తీసుకురాని పరిస్థితి లో ప్రభుత్వం ఉందని విమర్శలు చేసారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు శివారెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.