తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని టి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. విజయ్ కుమా ర్ సూచించారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున ఆధ్వర్యంలో, ఉప్పల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరా మారావు విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పూలమా లలు వేసి నివాళులు అర్పించారు.
తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు తెలుగు యువత, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి విజయ్ కుమార్ ముఖ్య అతిథు లుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యక్రమాల కార్యదర్శి పసల ప్రసాద్, నాయకులు యాదగిరి, పబ్బతి శేఖర్ రెడ్డి, రవిందర్, శ్రీను, చారి, తెలుగు యువత నాయకులు వంశీ, హేమంత్, శివ, వేంకటేశ్వర, ఓం, రమణ, మణికంఠ, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి