మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని పటేల్ కుంట చెరువు సుందరీకరణ లో భాగంగా చెరువు లోకి వచ్చి చేరుతున్న మురుగునీరు చెరువులోకి పోకుండా చేసేందుకు రూ. కోటి 80 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. నిధులు మల్లూరు చేసినందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే పటేల్ కుంట చెరువు సుంద రీకరణ పనులు కూడా తొందరగా ప్రారంభం అయ్యేలా చూడాలని, హిందూ స్మశాన వాటిక వైకుంఠ భాగంగా తీర్చిదిద్దాలని మంత్రి ని కార్పొరేటర్ కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఉప్పల్ శాసనసభ్యులు సుభాశ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సాయి జన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి