37.2 C
Hyderabad
April 26, 2024 19: 56 PM
Slider ప్రత్యేకం

నిధుల మంజూరుకు కేటీఆర్ కు కార్పొరేటర్ ధన్యవాదాలు

#ministerktr

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్  నాచారం డివిజన్ పరిధిలోని  పటేల్ కుంట చెరువు సుందరీకరణ లో భాగంగా చెరువు లోకి వచ్చి చేరుతున్న మురుగునీరు చెరువులోకి పోకుండా చేసేందుకు రూ.  కోటి 80 లక్షల  నిధులు మంజూరు అయ్యాయి. నిధులు మల్లూరు చేసినందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ధన్యవాదాలు తెలిపారు.  

అలాగే పటేల్ కుంట చెరువు సుంద రీకరణ పనులు కూడా తొందరగా ప్రారంభం అయ్యేలా చూడాలని,  హిందూ స్మశాన వాటిక వైకుంఠ భాగంగా తీర్చిదిద్దాలని మంత్రి ని  కార్పొరేటర్ కోరారు.  మంత్రిని కలిసిన వారిలో ఉప్పల్  శాసనసభ్యులు సుభాశ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,  సాయి జన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కొవిడ్‌ బాధిత అట‌వీ ఉద్యోగుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం

Satyam NEWS

సకల జనానికి చుక్కలు చూపిస్తున్న సూరిబాబు

Satyam NEWS

తిరుపతి వేంకటేశ్వరుడి సొమ్ము తరలిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment