కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనత మహిళా మొర్చా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకి 33శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ప్రతి మహిళ తరుపున నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ద్వారా మహిళలకి రాజకీయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సంధ్య, కౌన్సిలర్ మానస, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదమ్మ, పద్మ, స్వరూప, బాలమని, హారిక, సుశీల, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.