గద్వాల జిల్లా కేంద్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలని పట్టణ అధ్యక్షుడు బండాల వెంకట్రాములు డిమాండ్ చేశారు. పేద ప్రజల కోసం ఇచ్చిన పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లకొని అక్కడ ఆసుపత్రి,నర్సింగ్ కలశాల నిర్మాణం చేయడం సమంజసం కాదని బిజెపి పట్టణ అధ్యక్షుడు బండాల వెంకట్రాములు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సోమవారం బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూహై కోర్టు తీర్పు ను బీఆర్ఎస్ నాయకులు ధిక్కరించి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా కేంద్రం లో మాజీ మంత్రి డీకే అరుణ హయాంలో పేద ప్రజల కోసం 1500 ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో పేద ప్రజలకు రుణాల ఇవ్వకపోవడం తో పేద ప్రజలు ఇండ్లు కట్టుకోలేక పోయారు.పేద ప్రజలకు కోసం ఇచ్చిన పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లకొని అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ధిక్కరించి అక్కడ నర్సింగ్ కలశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం పై ఆయన మండిపడ్డారు.పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.