ఈ నెల 12 సిక్కోలు జిల్లా రణస్థలం లో జనసేన పార్టీ నిర్వహించనున్న “యువశక్తి” కార్యక్రమానికి భారీ స్థాయిలో యువత అంతా తరలి రావాలని ఆ పార్టీ నేతలు యశస్వి, అయ్యలు కోరారు.యువత కోసం… “యువశక్తి” కార్యక్రమం చేపడుతున్నామని జనసేన పార్టీ తెలిపింది. ఈ మేరకు విజయనగరం జనసేన పార్టీ తెలియజేసింది. ఈ నెల 12 సిక్కోలు జిల్లా రణస్థలం లో “చలో రణస్థలం” పేరు తో జనసేన పార్టీ “యువశక్తి” కార్యక్రమం నిర్వహించదలచిందని విజయనగరం
జిల్లా జనసేన పార్టీ నేతలు యశస్వి, ఇటీవలే ఆ పార్టీ లో చేరిన ప్రముఖ వ్యాపార వేత్త జీఎస్ఆర్ హోటల్ అధినేత గురాన అయ్యలు తెలిపారు. నగరంలో ఉడాకాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ఠ్రాలుగా విభజింంబడి…పలు ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నా…
ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని… అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉందని యశస్వి, అయ్యలు తెలిపారు. ఈ క్రమంలో ఆ సమస్యలపై యువతలో గళమెత్తించేందుకు జనసేన పార్టీ అధినేత నడుం బిగించారని చెప్పారు. ఇప్పటంలో జనసేన పార్టీ అధినేత పవన్ నిర్వహించిన సభను మించి….
సిక్కోలు జిల్లా రణస్థలం లో “యువశక్తి” పేరు తో కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. అదే రోజు వేలాది మంది యువత పాల్గొనాలని.,.పాలవలస యశస్వి, గురాన అయ్యలు కోరారు.