గత జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో 31,77,940 మంది గిరిజనులు ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సరూత తెలిపారు. లోక్సభలో తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం 3,02,034, మహబూబాబాద్ 2,92,778, ఆదిలాబాద్ 2,24,622, నల్గొండ 2,09,252, ఖమ్మం 1,99,342, సూర్యాపేట 1,41,271, రంగారెడ్డి 1,38,710, కుమురంభీమ్ ఆసిఫాబాద్ 1,33,627, నిజామాబాద్ 1,07,035, నాగర్కర్నూల్ 1,06,880, వరంగల్ రూరల్ 1,05,300, మహబూబ్నగర్ 1,03,005 జిల్లాల్లో వీరి జనాభా లక్షకు పైబడి ఉన్నట్లు వివరించారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 9,376 మందే ఉన్నట్లు తెలిపారు.
previous post
next post