28.7 C
Hyderabad
April 28, 2024 03: 15 AM
Slider ఖమ్మం

కార్యాలయంలో పరిసరాలు పరిశుభ్రoగా ఉంచాలి

#Collector D Madhusudan Naik

కార్యాలయంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది చేపట్టిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని, ఐడిఓసి ఆవరణలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల తొలగింపు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన కార్యాలయంలో, వెలుపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పని ప్రదేశాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి, పనిపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. మనం పనిచేసే ప్రదేశాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మనం ఎక్కువ సమయం వుండే కార్యాలయాన్ని అలాగే పరిశుభ్రంగా ఉంచాలన్నారు.కార్యక్రమం లో ఐడిఓసి లోని జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత ఆర్మీకి త్వరలోనే ప్రత్యేక ఆడియో పాట

Sub Editor

వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Satyam NEWS

గిరిపుత్రులతో విజయనగరం ఎస్పీ దీపిక మమేకం…

Satyam NEWS

Leave a Comment