38.2 C
Hyderabad
April 29, 2024 11: 49 AM
Slider కృష్ణ

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చైల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ కు వినతి పత్రం సమర్పించింది. శాసనసభ్యుడు మల్లాది విష్ణు సమక్షంలో విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ నేతృత్వం వహించారు. విజయవాడ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పల్లెబాట సి. ఈ. ఓ.

రమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ కి ఐ. డి. కార్డు ఇస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదే విధంగా ఉచిత లక్ష రూపాయల జీవిత బీమా కూడా చేయిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు తీర్చే విషయంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

విశాఖలో ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ కలకలం

Bhavani

బీజేపీ నేతల ఇంటింటికీ మోడీ సందేశం కార్యక్రమం

Satyam NEWS

నేటి నుంచి వెలిగొండ శ్రీసిద్దేశ్వరస్వామి, భగళముఖి దేవి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment