నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని ఏలుతూ మతం ముసుగులో, ఫాసిజం మత్తులో పాలన చేస్తుందన్నారు. ఈ దేశాన్ని, దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి, యువజనులదే అని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు )జాతీయ ప్రధాన కార్యదర్శి పి ప్రసాద్ అన్నారు. ఖమ్మం నగరంలో ఫాసిజం, ఆర్ధిక సంక్షోభం అంశాలపై జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో పెట్టుబడి దారుల మధ్య పోటీ వలన సంక్షోభాలు వస్తాయన్నారు. మతం ముసుగులో, ఫాసిజం మత్తులో పాలన సాగుతుందన్నారు. ఈ దేశాన్ని, దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి, యువజనులదే అని నిర్దేశించారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులను మోడీ ప్రభుత్వం నిర్భందాలకు గురిచేస్తుందన్నారు.
ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలను అవలంబిస్తూ అవే పెద్ద సౌభాగ్య వెలుగు దీవెనలు అంటూ ప్రచారాలు బాటాలు ఉదుకోవడం మోడీ చేస్తుండన్నారు. తప్పుడు ఆర్ధిక విధానాల వలన రూపాయి విలువ రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేశారు. ఇది ఒక భారీ కుట్ర ప్రయోగం అన్నారు. సంపద చట్టబద్ధం చేసుకోవడానికి దివాళా తీసిన బ్యాంకులకు సేవ కల్పించడానికి, ప్రజల సొమ్ముతో బ్యాంకులు ఖజానా నింపి కార్పొరేట్లకు రుణాలు ఇవ్వడానికి, నోట్ల మార్పిడీ ఉపయోగపడిందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థను పతనం చేసి పెద్ద నోట్లు రద్దు, జిఎస్టి ద్వారా ప్రజలపై భారాలు మోపాయన్నారు. ఆర్థిక రంగాన్ని ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టాడన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలక అప్పగించాడన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టాలను ఇష్టారాజ్యంగా చేస్తుండన్నారు. దేశం ఆర్ధిక సంక్షభంలో కూరుకపోతుందన్నారు. మాట్లాడే వారిపై నిషేదం విస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పర్శ అధ్యయన వేదిక వ్యవస్థపకులు కాకి భాస్కర్, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, తెలంగాణా ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాష్ట్ర నాయకులు తాళ్ళూరి వేణు, పౌరహక్కుల సంఘం(CLC) జిల్లా కార్యదర్శి పి.విప్లవకుమార్ తదితరులు ప్రసంగిoచారు.