ఒక వైపు కరోనా వ్యాప్తి ఆగకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముస్లింలకు రంజాన్ సందర్భంగా పలు పబ్లిక్ సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:
1. 24×7 విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుంది. 2. ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చూస్తుంది. 3. కూరగాయలు, పండ్ల ఫలాలు, మిగతా అన్ని నిత్యవసర సరుకులు ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
4. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి పండ్ల ఫలాలు,డ్రై ఫ్రూట్స్ అమ్ముటకు అనుమతి ఇచ్చి ముస్లిం సోదర సోదరీమణులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. 5. సామాజిక దూరం పాటిస్తూ ఉదయం 3 – 4.30 వరకు సాయంత్రం 5.30 – 6.30 వరకు దాతలు ఎవరైనా పేదలకు దానం చేయుటకు బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
6. మీ నగరాలలో కొన్ని హోటల్స్ ను గుర్తించి సహరి ఇఫ్తార్ సమయాలలో మాత్రమే భోజనం, ఇతర తినబండారాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది. 7. క్వారన్ టైన్ లో ఉన్న ముస్లిం లకు సహరి, ఇఫ్తార్ సమయంలో వ్యాధి నిరోధక శక్తి, సామర్ధ్యాన్ని పెంచే ఆహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది. 8. ఇమామ్, మౌజన్ లకు 5 పూటలా నమాజులు చదివించి మస్జీద్ నుండి ఇంటికి, ఇంటి నుండి మస్జీద్ కి వెళ్లే వెసులుబాటు కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.