నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.
previous post