తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయడానికి కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో నేడు నలుగురు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. నాలుగు నామినేషన్స్ లో ఒకే ఒకటి పొలిటికల్ పార్టీ నుంచి దాఖలు కాగా మిగతా ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. బీఎస్పీ నుంచి సురేష్ గౌడ్ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థులుగా గుగులోత్ వెంకన్న, ఎర్రోళ్ల నరేష్, చిట్టిబోయిన సులోచన రాణి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాల నుంచి నామినేషన్స్ వేస్తామని కొంతమంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. లబాణా కాయితి లంబాడాలు సైతం నామినేషన్ వేయడానికి పత్రాలు తీసుకెళ్లారు. సోమవారం నుంచి నామినేషన్లు ఎక్కువగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సత్యం న్యూస్, కామారెడ్డి