32.7 C
Hyderabad
April 27, 2024 01: 19 AM
Slider ప్రపంచం

ముగ్గురు పాకిస్థానీ మాదకద్రవ్యాల స్మగ్లర్ల కాల్చివేత

#BSF

పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు మాదక ద్రవ్యాల స్మగ్లర్లను సరిహద్దు భద్రతా దళాలు కాల్చి చంపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కోటి రూపాయల విలువైన 36 కిలోల హెరాయిన్‌ను వారు  తీసుకువెళుతుండగా BSF అధికారులు ఆదివారం నాడు కాల్చివేశారు. ఈ ఏడాది సరిహద్దు వెంబడి జరిగిన అతి పెద్ద నాలుగవ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నం ఇది. గత ఏడాది కాలంలో మొత్తం తొమ్మిది మంది పాకిస్థానీ చొరబాటుదారులు ఇటువంటి వివిధ ప్రయత్నాలలో ఉండగా సరిహద్దు భద్రతా దళాలు కాల్చివేశాయి. స్మగ్లర్లు చీకటి, పొగమంచు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను ఇటువైపుకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారు. మాదక ద్రవ్యాలతో చొరబడుతున్న ముగ్గుర్ని హతమార్చగా వారి వద్ద నుంచి 36 మాదక ద్రవ్యాల ప్యాకెట్లు దొరికాయి.

Related posts

ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న సీబీఐ

Satyam NEWS

తాగి వాహనం నడిపినా పోలీసులు వాహనాన్ని ఇక సీజ్ చేయలేరు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు

Satyam NEWS

Leave a Comment