పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు మాదక ద్రవ్యాల స్మగ్లర్లను సరిహద్దు భద్రతా దళాలు కాల్చి చంపాయి. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కోటి రూపాయల విలువైన 36 కిలోల హెరాయిన్ను వారు తీసుకువెళుతుండగా BSF అధికారులు ఆదివారం నాడు కాల్చివేశారు. ఈ ఏడాది సరిహద్దు వెంబడి జరిగిన అతి పెద్ద నాలుగవ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నం ఇది. గత ఏడాది కాలంలో మొత్తం తొమ్మిది మంది పాకిస్థానీ చొరబాటుదారులు ఇటువంటి వివిధ ప్రయత్నాలలో ఉండగా సరిహద్దు భద్రతా దళాలు కాల్చివేశాయి. స్మగ్లర్లు చీకటి, పొగమంచు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను ఇటువైపుకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారు. మాదక ద్రవ్యాలతో చొరబడుతున్న ముగ్గుర్ని హతమార్చగా వారి వద్ద నుంచి 36 మాదక ద్రవ్యాల ప్యాకెట్లు దొరికాయి.