40.2 C
Hyderabad
April 29, 2024 15: 11 PM
Slider హైదరాబాద్

గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

#Golconda

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆంక్షల సమయంలో రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి అధికారులు ఇప్పటికే పాసులు జారీ చేశారు.

ఆ మార్గంలో ఏ గోల్డ్, ఏ పింక్‌, బీ బ్లూ పాసులు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.సీ, డీ, ఈ పాసులు కలిగిన వారికి ఇతర మార్గాల నుంచి అనుమతి ఉంటుంది. పాసులు ఉండి సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు బంజారాహిల్స్, మెహదీపట్నం, రేతిబౌలి, నాలానగర్, లంగర్ హౌస్ వంతెన, రాందేవ్‌గూడ మీదుగా గోల్కొండ చేరుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఈ బ్లాక్ పాస్ కలిగిన సాధారణ ప్రజలు హుడా పార్క్‌లో పార్కింగ్ చేసుకొని వేడుకలకు హాజరు కావాలని సూచించారు.

Related posts

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

ఉగ్రవాదులే కాదు అక్కడ నుంచి మిడతలు కూడా

Satyam NEWS

మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలను పంపిణి చేసిన ఎన్.వై.కే…!

Satyam NEWS

Leave a Comment