కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనంతో పాటు అశోక్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్ సర్వేటర్ అర్ శోభ మొక్కలు నాటారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్త్రీ కోర్సు చేస్తున్న విద్యార్థినీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ప్రతి పట్టణంలో ఈలాంటి వనాలను ఏర్పాటు చేయాలని కోరారు. సాయంత్రం సమయంలో ఈ లాంటి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, స్పెషల్ అధికారి తేజస్ నందలాల్ పవార్, డిఎఫ్ఓ వసంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.