సంత్ సేవాలాల్ వేడుకలకు హాజరైన నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆ ప్రాంత గిరిజనులు అపూర్వ స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లి మహా క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలో సంత్ సేవాలాల్ సత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో గిరిజనుల కోసం సత్రం ఏర్పాటు చేసుకోవడానికి భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ12 శాతం రిజర్వేషన్లు,ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి,గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 50 కోట్ల రూపాయలతో మట్టపల్లి కృష్ణా నదిపై వంతెన,లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు,సబ్స్టేషన్లు,రోడ్లు, పాఠశాలలు మంజూరు చేసి నిర్మించినందుకు పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్థానిక గిరిజన నాయకులు అభినందించి ఆశీర్వదించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక గిరిజన నాయకులు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడు గా, మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీరాజనం పట్టారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్