వైయస్ వివేక జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కుమార్తె వైయస్ సునిత అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైయస్ వివేక పార్కులో కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వైఎస్ సునీత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేక తాను ఇంటర్ చదువుతున్న సమయంలో తనతో ఒక మాట అన్నారని అన్నారు. మన గురించి ఒకరు పొగిడే వాళ్ల గురించి పట్టించుకోకూడదని, ఎవరైతే మన గురించి తప్పులు చెప్తారొ వాటిని గ్రహించి లోపాలను సరిచూసుకోవాలని చెప్పేవారని అన్నారు. ఈరోజు నాన్నగారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామని, ఎక్కువగా గుర్తోస్తున్నారన్నారు. సిబిఐ విచారణ విషయంలో వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని మన జోక్యం అవసరం లేదని అన్నారు.
previous post