38.2 C
Hyderabad
April 28, 2024 22: 39 PM
Slider మహబూబ్ నగర్

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాబూ జగ్జీవన్‌రామ్

#babujagjeevanram

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు.

స్వాతంత్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు.

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకోసం పాటుపడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్, డిఆర్డిఓ నర్సింగ్ రావు డిపిఆర్ఓ సీతారాం, శివ వెంకటయ్య ఇతర శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

Курси Front End Developer в Києві ᐈ Курс фронтенда Розробник ᐈ CyberBionic Systematics

Bhavani

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS

మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేరా?

Satyam NEWS

Leave a Comment