ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్చి 19న జారీ చేసిన జీవో 402పై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో సర్వీస్ లెక్కింపు నిబంధనలకు సంబంధించిన ఈ జీవో ద్వారా తాము నష్టపోతామని కె.తిరుపతిరెడ్డి సహా మరో 8 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున వాటితో పాటు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
ఈ నెల 6 వరకు జీవో 402పై స్టే విధించింది. కాగా, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పీఆర్టీయూటీఎస్ విజ్ఞప్తి చేసింది.