38.2 C
Hyderabad
April 27, 2024 18: 02 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో బదిలీల జీవోపై హైకోర్టు స్టే

#court

ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్చి 19న జారీ చేసిన జీవో 402పై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో సర్వీస్‌ లెక్కింపు నిబంధనలకు సంబంధించిన ఈ జీవో ద్వారా తాము నష్టపోతామని కె.తిరుపతిరెడ్డి సహా మరో 8 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున వాటితో పాటు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

ఈ నెల 6 వరకు జీవో 402పై స్టే విధించింది. కాగా, పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు పీఆర్‌టీయూటీఎస్‌ విజ్ఞప్తి చేసింది.

Related posts

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS

అమ్మాయిలూ మీకు భరోసాగా షీ టీమ్స్ ఉన్నాయి

Bhavani

ఢిల్లీ ఫలితాల ప్రభావం పౌరసత్వ చట్టంపై ఉండదు

Satyam NEWS

Leave a Comment