ఆసుపత్రుల సందర్శన లో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ జననేత వై ఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్య శ్రీతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.