టీఆర్ ఎస్ నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని, పట్టభద్రులకు, సామాన్య ప్రజానీకానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్.
ఈ ఉదయం బీజేవైఎం యువ నాయకుడు నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాలా హరీశ్ రెడ్డితో కలిసి కూకట్ పల్లి ఐడీఎల్ చెరువుకట్టపై మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
టీఆర్ ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేసీఆర్ సర్కార్ ప్రజలను వంచించిందని మండిపడ్డారు మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి.