అబ్బాపూర్ ఎంపిటిసి ఆరెందుల రాధిక భర్త, ప్రస్తుత అబ్బాపూర్ వార్డు సభ్యుడు ఆరేందుల కుమార్ ను ములుగు మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పరామర్శించారు.
దాడికి గురైన ఆరేందుల కుమార్ చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకులతో కలిసి వెళ్లిన బాదం ప్రవీణ్ ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆస్పత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
ఆయన వెంట ములుగు జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్,ములుగు ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, సాణికొమ్ము రమేష్ రెడ్డి, ఇండ్ల రాజు,శ్రీనివాస్ తదితరులు వున్నారు.