కరోన విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామీణులకు టీఆర్ఎస్ నేతలు సాయపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో టీ. ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు తన సొంత డబ్బులతో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు సమకూర్చారు.
అదే విధంగా అహర్నిశలూ పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా నిత్యావసర సరుకులు అందచేశారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేతుల మీదుగా ఈ నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో Ci నాగరాజు, Si నర్సింలు, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ యాదవ్, ఎంపీటీసీ రాములు,వెల్దండ సర్పంచ్ భూపతి రెడ్డి,మాజీ ఎంపీపీ జయప్రకాష్,వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షుడు. సత్యనారాయణ గ్రామస్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.