30.7 C
Hyderabad
April 29, 2024 04: 00 AM
Slider హైదరాబాద్

సివిక్ ప్రాబ్లమ్స్: పాలన పట్టించుకోని తెలంగాణ పాలకులు

madhavaram

అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం మానేసిందని బీజేపీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో ఈ రోజు  బిజెపి బస్తీ బాట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

అందులో  భాగంగా సుమిత్రా నగర్, భాగ్ అమీర్, శాంతినగర్ లలో పర్యటించారు. స్థానికంగా తవ్వి వదిలేసిన రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలపై డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ ఆధ్వర్యంలో బస్తీ బాట కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి మాధవరం కాంతారావు ముఖ్య అతిధిగా విచ్చేసి పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చడం లో భాజపా ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల ప్రజల సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ గజ్జల యోగానంద్,  భీమ్రావు,  డాక్టర్ నరేష్, జి అరుణ్ కుమార్, ఏకాంత్ గౌడ్, బాలకృష్ణ, నామాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుడ్ వర్క్: అభాగ్యుల ఆకలిని తీరుస్తున్న యువత

Satyam NEWS

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

గోల్డెన్ లెగ్: బంగారు ప్లేట్ పై కేటీఆర్ బొమ్మ

Satyam NEWS

Leave a Comment