జిల్లాలో యూనిట్ల స్థాపనకు టిఎస్-ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టీఎస్-ఐపాస్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 61 యూనిట్ల స్థాపనకుగాను 100 అనుమతులకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. 88 దరఖాస్తులను అనుమతించడం జరిగిందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు సంబంధించి 2 దరఖాస్తులు అనుమతి కొరకు పరిశీలనలో ఉన్నాయన్నారు.
విద్యుత్ శాఖకు సంబంధించి 1 దరఖాస్తుకుగాను అనుమతుల ప్రక్రియ ప్రగతిలో ఉందన్నారు. ఫ్యాక్టరీలకు సంబంధించి 2 దరఖాస్తులకుగాను 1 దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా, 1 దరఖాస్తు పరిశీలనలో ఉన్నాయన్నారు.
పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 2 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
పరిశీలన ప్రక్రియలో దరఖాస్తులు తిరస్కరించక, దరఖాస్తుదారునితో ఆయా అనుమతికి కావాల్సినవి సమర్పణకు వారికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.