ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకున్నది. చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతలు చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు మోహరించినా వైసిపి నేతలు రెచ్చిపోయారు. రాజధాని ప్రాంతంలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ బాహాబహి జరిగింది. ఒకరిపై ఒకరి వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఈ దశలో పోలీసులకు టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వెంకటపాలెంలో టీడీపీ వారికి అనుమతి లేదంటూ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉద్దండరాయునిపాలెంలో టీడీపీకి అనుమతి ఉందంటూ టీడీపీ నాయకులకు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు.
previous post
next post