ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కరకట్టపై రైతులు, రైతు కూలీలు నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీలో రైతులు పేర్కొన్నారు. చంద్రబాబు గ్రామ కంఠకాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. జీవో నంబర్ 41 జారీ చేసి అసైన్డ్ భూములు సాగు చేస్తున్న దళితులకు అన్యాయం చేసారని వారు ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి రైతులకు క్షమాపణ చెప్పాలని ఫ్లక్సీలలో పేర్కొన్నారు. చంద్రబాబు మరోసారి మా జీవితాలతో ఆడుకోవద్దు అంటూ వారు నిరసన తెలుపుతున్నారు.
previous post