ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల పై ఇచ్చే రాయితీ ని ఇక రాష్ట్రమంతా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది .
మొదటిరోజైన మార్చి 1 వ తేదీన హైదరాబాద్ లో దాదాపు 5 లక్షల చలాన్ల ద్వారా 7 కోట్ల మేరకు ఆదాయం రావటంతో వెంటనే దీనిని రాష్ట్ర మంత అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు . హైదరాబాద్ పరిధిలోనే 1.20 కోట్ల చలాన్లు పెండింగ్ లో వుండగా , రాష్ట్ర మంత మరో కోటికి పైగా చలాన్లు పెండింగ్ లో వున్నట్లు గుర్తించిన అధికారులు రాయితీ విధానాన్ని అంతటా అమలు చేయాలని విర్ణయించారు .
2,3 చక్రాల వాహనాలకు 75 శాతం , ఆర్టిసి డ్రైవరులకు 70 శాతం , కార్లు , పెద్ద వాహనాలకు 50 శాతం రాయితీతో ఇవ్వనుండగా , నో మాస్క్ కేసులలో 900 రూపాయలు మాఫీ చేసి 100 రూపాయలు కడితే చాలని అధికారులు సూచించారు .
పేద లు, మధ్య తరగతి ప్రజలు గత రెండు సంత్సరా లుగా కోవిడ్ వలన పడిన ఆర్థిక ఇబ్బందులని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాఋ. మార్చ్ 31 వరకు తెలంగాణా ఈ చాలన్ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించారు.