రాష్ట్ర మున్పిపల్, పట్టాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు…హాడావుడిగా విజయనగరం జిల్లా కు వచ్చి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2 కోట్ల 54 లక్షలతో రోడ్డు పనులు, పార్క్ లను ప్రారంభించారు.
తొలుత ధర్మపురి లోని పబ్లిక్ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన పార్క్ గేటును ఇన్ చార్జ్ మంత్రితొకలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
అనంతరం..మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని గాందీ పార్క్ వద్ద రోడ్డు పనులకు అలాగే దాసన్నపేట రైతు బజార్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు శంకు స్తాపన చేసారు.
అక్కడ నుంచీ ఆదే కాలనీలో 16 లక్షలతో మహిళలతో కలిసి…ఇద్దరు మంత్రులు,స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు పార్క్ ను ప్రారంబించారు.
అక్కడ నుంచీ బాబా మెట్టలోని వాటర్ ట్యాంక్ ను మంత్రులు బొత్స,వెల్లింపల్లిలు ప్రారంభోత్సవం చేసారు. ధర్మపురి, పార్క్ గేట్, బాబా మెట్ట ప్రాంతాల్లో.1.18 కోట్లతో మూడు రోడ్లు, బాబామెట్ట లొ ఒక కోటి పదిలక్షలతో నిర్మించిన వాటర్ టాంక్ ను మంత్రులు బొత్స, వెలంపల్లి లు ప్రారంభించారు.
మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ,మున్సిపల్ కమీషనర్ వర్మ,మున్సిపల్ పీఆర్వో చౌదరి లు పాల్గొన్నారు.