కడపజిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది ఒడ్డుకు పుట్టినరోజు జరుపుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మృతదేహాలను అక్కడే ఉన్న రజకులు వెలికి తీశారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుస్సేన్ మసీదు వీధికి చెందిన మహమూద్ తన పుట్టిన రోజున తోటి విద్యార్థులను వెంట బెట్టుకుని పెన్నా నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లారు.
మధ్యాన్నం భోజనం చేసాక నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు అక్కడున్న పూడులో ఇరుక్కు పోయారు.
విద్యార్థులు కేకలు వేయడంతో రజకులు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు.వారి ప్రయత్నాలు ఫలించలేదు. తాహీర్,మహమూద్ గౌస్ మృతదేహలను వెలికి తీశారు.