35.2 C
Hyderabad
April 27, 2024 14: 08 PM
Slider ముఖ్యంశాలు

ఉదయం దినపత్రిక రామకృష్ణ ప్రసాద్ ఇక లేరు

#RamakrishnaPrasad

ఉదయం దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన రామకృష్ణ ప్రసాద్ ఒక లేరు. ప్రముఖ సినీ దిగ్గజం దాసరి నారాయణ రావుకు అత్యంత సన్నిహితుడైన రామకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా ఘంటశాల గ్రామానికి చెందిన వారు. ప్రముఖ స్వాంతంత్ర్య సమరయోధుడు గొట్టిపాటి బ్రహ్మయ్య మనవడు.

ఉదయం దినపత్రికలో ఉద్యోగులందరితో రామకృష్ణ ప్రసాద్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పత్రిక మూతపడిన తర్వాత కూడా ఆయన ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. కొత్త వారిని ప్రోత్సహించడం, టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేసుకుని ఉన్నతస్థానాల్లోకి తీసుకురావడం రామకృష్ణ ప్రసాద్ చేసేవారు.

ఉదయంలో చేరక ముందు నుంచే ఆయన రచనా వ్యాసాంగాన్ని చేసేవారు. హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న రామకృష్ణ ప్రసాద్ సుమారు ఏడాది కాలంగా అస్వస్థులుగానే ఉన్నారు. చివరకు ఆయన తుది శ్వాస విడిచారు.

జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Related posts

బూస్టర్ డోస్‌ పై WHO కీలక ప్రకటన

Sub Editor

డాక్టర్లూ మధుమేహంపై దృష్టి సారించండి

Satyam NEWS

పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ మను

Satyam NEWS

Leave a Comment