ఖమ్మం జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రిలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. ఆసుపత్రిలో ఉన్న లిఫ్టు రాకముందే డోరు తెరిచి కాలు వేయడంతో ఆ మహిళ మృతి చెందింది. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యింది. అదే సమయంలో ఫోన్ మాట్లాడుతూ గమనించకుండా ఆ మహిళ లోపలికి అడుగు వేయడంతో లిఫ్ట్ గుంతలో పడి పోయింది. దీంతో పైనుంచి వచ్చిన లిఫ్ట్ ఆమెపై పడింది. తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. చనిపోయిన మహిళ ఖమ్మం జిల్లాలోని వైరా మండలం గొల్లెనపహాడ్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యిందంటే ఇది పూర్తిగా మెయింటినెన్స్ లోపంతో జరిగినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.