32.2 C
Hyderabad
May 12, 2024 22: 53 PM
Slider గుంటూరు

కోటప్పకొండ అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం

#gopireddy srinivasreddy

ప్రసిద్ధి గాంచిన మహిమాన్విత క్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్ర పర్యాటక,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ని కోరారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నేడు విజయవాడ ఇంద్రకీలాద్రి లో కనకదుర్గమ్మ ను దర్శించుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివెల్లంపల్లి శ్రీనివాసరావుతో బాటు నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

ప్రసాద్ “PRASAD” ( Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive)అనే పథకం క్రింద నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. త్రికోటేశ్వరుడు కొలువైన కోటప్పకొండ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని, కావాల్సిన అభివృద్ధి పనులు ఆవశ్యకత ను కేంద్ర మంత్రికి విశదీకరించారు. తప్పకుండా కోటప్పకొండ అభివృద్ధి లో పాలుపంచుకుంటామని, అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

Related posts

రీడ్ ఇండియా సెలబ్రేషన్ ఫైనలిస్టుల జాబితా ఇదే

Satyam NEWS

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

తెలంగాణ రైతుల భీమా కోసం రూ.1450 కోట్లు చెల్లింపు

Satyam NEWS

Leave a Comment