కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ హాజరైన ప్రొగ్రామ్స్…!
కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖమంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ ఈ నెల 25 సాయంకాలం విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చిన సంగతి విదితమే. గత రాత్రే నగర సమీపంలోని ఎన్.కన్వెషన్ హాలులో మేథావులు సభలో పాల్గొన్న మంత్రి ఈ ఉదయం…జేడ్పీ గెస్ట్ హౌస్ నుంచీ మొదలుకుని..పైడితల్లి అమ్మవారి టెంపుల్ ,గుంకలాం,గొట్టాం, రామతీర్ధం, కుమిలి.కేంద్ర హాస్పటల్ అయిదు చోట్ల పర్యటించి అటు రెవిన్యూ,ఇటు దేవాదాయ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ,ఇంకో వైపువ్యవసాయ శాఖ అధికారులను తన పర్యటనలతో పరుగులు పెట్టించారు.
తొలుత గెస్ట్ హౌస్ నుంచీనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.అక్కడ నుంచీ గుంకాలంలోని జగనన్న లేఅవుట్ ను పరిశీలించారు. అక్కడే బీజేపీ నేత కుసుమించి సుబ్బారావు…కేంద్ర మంత్రి స్వాగతం పలికారు.
అక్కడే హౌసింగ్ జేసీ మయూర్ అశోక్….కేంద్ర మంత్రికి జగనన్న లే అవుట్ లో నిర్మిస్తున్న ఇండ్లను పరిస్థితిని వివరించారు. అలాగే అక్కడే కేంద్ర మంత్రి లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. అక్కడ నుంచీ గొట్లాంలోని నాడు-నేడు కార్యక్రమాన్ని పరిశీలించారు.అక్కడే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చదువును వాళ్లనే అడిగి తెలుసుకున్నారు..కేంద్ర మంత్రి మాండవీయ.
అక్కడ నుంచీ నెల్లిమర్ల మండలం రామతీర్ధంలోశ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లారు. అక్కడున్న దేవాలయాన్నిసందర్శించారు. ఇక ఆతర్వాత సరాసరి కుమిలి మండలంలో ప్రవేశించి…కుమిలిలో రైతు బరోసా కేంద్రాన్ని…వ్యవసాయ ఉత్సత్తులు కేంద్రాన్ని నిశితంగా కేంద్ర మంత్రి పరిశీలించారు.
ఆ కార్యక్రమం అయిన వెంటనే విజయనగరంలోని జిల్లా ప్రభుత్వ కేంద్ర వైద్య శాలలో మాడ్యులర్ పీడియాట్రిక్ ఐపీయూ యూనిట్ కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖమంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ ప్రారంభించారు.