ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం ఈఓ,సిబ్బంది…!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో అందునా మోడీ కేబినెట్ లో ముఖ్యమైన శాఖ ను చూసే డా మన్ సుఖ్ మాండవీయ…ఢిల్లీ నుంచీ గల్లి అదీ ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ది గాంచిన రామతీర్ధం దేవస్థానానికి రావడం విశేషం సంతరించుకుంది. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా ఎలా విజృభించిందో ఎవ్వరికి తెలియనది కాదు.
ఆ రకంగా జిల్లాలోని రామతీర్ధం కూడా..అదే సమయంలో బొడికొండపై రాములోరి విగ్రహ ఖండనపై దేశ వ్యాప్తంగా ఓ సంచలనమైంది.ఆ సమయంలోనే ఉత్తరాంద్రా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్… ఏకంగా కొండ వద్దే ధర్నా చేయడం…అలాగే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..ఆకస్మక పర్యటనతో అరెస్ట్అవ్వడం..అన్ని సంచలనాలే.
అటువంటి రామతీర్ధం నీలాచలం కొండపై పాత ఆలయాన్ని రాజుల కాలంలో నిర్మించిన అతి పురాతన కట్టడాన్ని కూల్చి దానిస్థానంలో…పూర్తిగా రాతి కట్టడంతో… కొత్త ఆలయం నిర్మించడం…అందులో కొత్త విగ్రహాలు ప్రతి్ష్టజరగడం అన్ని జరిగిపోయాయి.
దీనికి తోటు జగన్ ప్రభుత్వంలో రెండోసారి జరిగిన కేబినెట్ విస్తరణలో దేవాదాయశాఖ మంత్రి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మెట్టుసత్యనారాయణ స్వహస్తాలతో ప్రారంభించడం అన్ని జరిపోయాయి. అయితే గతంలో విగ్రహ శిరస్సు ఖండన విషయంలో బీజేపీ ఏకంగా ధర్నాలు చేయడాన్ని…గుర్తించిన ఆ పార్టీ..ప్రస్తుతం..కేంద్ర మంత్రి ని సరాసరి రామతీర్ధంలో కిందనున్న రాములోరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించడం వంటిని జరగడంతో…ఓ రకంగా తగ్గేదేలే అన్న యోచనలోనే పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి మాండవీయను…ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని,ఎమ్మెల్సీ మాధవ్..పార్టీ నేతలంతా మూకమ్మడిగా రామతీర్ధంకు తీసుకు రావడంతో పార్టీ మనుగడ కోసమే నని అంటున్నారు..కొందరు.