30.7 C
Hyderabad
April 29, 2024 04: 04 AM
Slider హైదరాబాద్

అయ్యప్ప పూజలలో పాల్గొనడం మహదానందం

#uppalmla

నిష్టతో సాగుతున్న అయ్యప్ప పడిపూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకోవడం మహాదానందంగా ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం బొజ్జ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దీక్షల నేపథ్యంలో మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప స్వామి కృప కటాక్షాలకు పాత్రులు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, టిఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్, సత్తిరెడ్డి, కడియాల బాబు, జవండ్ల వేణుగోపాల్ రెడ్డి, కడియాల నందకిషోర్, తూర్పాటి హనుమంతు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

లాలూ ప్రసాద్ యాదవ్ భగవద్గీత చదివితే అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం ను కలసిన లెహరాయి మూవీ నిర్మాత

Satyam NEWS

తుంగతుర్తి ప్రగతి నివేదిక సభ విజయవంతం చేయాలి

Bhavani

Leave a Comment