27.7 C
Hyderabad
April 26, 2024 06: 51 AM
Slider మహబూబ్ నగర్

పేద విద్యార్థికి సరస్వతి కటాక్షం ఇప్పించిన ఉప్పల

#uppala trust

పై చదువులు చదవడానికి స్తోమత లేని ఒ నిరుపేద విద్యార్థికి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ సరస్వతి కటాక్షం ఇప్పించారు.

తలకొండపల్లి మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన కళ్యాణకర్ కార్తీక్ నిరుపేద విద్యార్థి. అతనికి పై చదువులు చదవటానికి ఆర్థిక పరిస్థితులు సహకరించ లేదు. 

దాంతో అతను తన తల్లితో కలిసి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కు తమ గోడు విన్నవించుకున్నాడు.

దాంతో స్పందించిన ఆయన హైదరాబాదులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ లో అడ్మిషన్ ఇప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ కార్ కార్తీక్ తండ్రి హుస్సేన్ చనిపోయారని చదువుకోవాలనే తపనతో ఉన్న ఆ విద్యార్థికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ లో సీటుఇప్పించాం అని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో  చాలామంది ఆర్థిక స్తోమత లేని వారు చదువుకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చదువుకోవాలని ఉన్న చదువు కొనుక్కునే స్తోమత లేక  చాలా మంది విద్యార్థులు కూలీలుగా, హమాలీ పని, గుమాస్తాలుగా జీవనం కొనసాగించాల్సి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్  వెంకట్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఇక సెలవు:దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు

Bhavani

ఏసిబి ట్రాప్ లో మహబూబ్ నగర్ మునిసిపల్ కమిషనర్

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో బోల్తాపడిన పెళ్లి వాహనం

Satyam NEWS

Leave a Comment