జాతీయ సమస్యలపై పోరాటాలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
మొత్తం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో టిపిసిసి మాజీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి స్థానం దక్కింది.ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను నియమించారు.
జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలు రచించే ఈ కమిటీలో ప్రియాంకా గాంధీ తో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్ది,మనీష్ చత్రత్,బికే హరిప్రసాద్, రిపున్ బోరా,ఉదిత్ రాజ్,రాగిణి నాయక్, జుబేర్ ఖాన్ సభ్యులుగా ఉంటారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్