తీన్మార్ మల్లన్న పై పోలీసులు జరుపుతున్న వరుస దాడులు పై బీసీ కమిషన్ సీరియస్ గా ఉన్న సీరియస్ గా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29 ఉదయం 11 గంటలకు డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ లు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ఈ నెల 10వ తేదీన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జాతీయ బీసీ కమిషన్ ను సంప్రదించారు.
ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్న పై జరుగుతున్న వరుస దాడులు, క్యూ న్యూస్ కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్లను పగలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన పోలీసులపై చర్యలలో భాగంగా ఆగ్రహంతో ఉన్న కమిషన్ ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ డీజీపీ తెలంగాణ, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ లను కచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.