32.7 C
Hyderabad
April 27, 2024 00: 45 AM
Slider తెలంగాణ

ఎలక్షన్ స్పీచ్:తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి

vemula speech

సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు చాలా మంది టీఆర్ఎస్ లో చేరారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు రాని వారు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 

45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు ఖర్చు అవుతుందని, దీనిలో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు. త్వరలోనే ‘పల్లె ప్రగతి’ తరహాలోనే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ తన మాటపై నిలబడలేదని విమర్శించారు.

Related posts

అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

జ్ఞాన్‌వాపి కేసులో హిందువుల డిమాండ్ కు ఎదురుదెబ్బ

Satyam NEWS

లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి

Satyam NEWS

Leave a Comment