ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కొందరి రేషన్ డీలర్ల పై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ స్టేట్ విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొందరు డీలర్ల బాగోతాలు బయట పడ్డాయి.ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని దారిమల్లిస్తు జేబులు నింపు కుంటున్నారు.దళారులతో కొందరు డీలర్లు చేతులు కలిపి ఏండ్ల దోచుకుంటున్నారు.. దీని పై ప్రజలు అధికారులకు పిర్యాదులు చేస్తూనే వస్తున్నారు.కొద్దిరోజుల కిందనే బిజేవైఎం నాయకులు రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశారు.దీనితో స్టేట్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. డీలర్లకు రేషన్ బియ్యం వచ్చిన మరుసటి రోజే రేషన్ బియ్యం దారి మళ్ళీ నట్టు అధికారులు నిర్ధారణ చేశారు. మరికొందరితో నిల్వచేసిన బియ్యం కంటే ఎక్కువగా కనిపించాయి. దీనితో అధికారులు పట్టణానికి చెందిన షాప్ నెంబర్1శ్రీనివాసులు , 2 విద్యాసాగర్, 3 రాజయ్య, 8 సత్యమ్మ డీలర్ల పై 6A కింద కేసులు నమోదు చేసి నలుగురీ షాప్ లను సీజ్ చేసినట్లు సివిల్ సప్లయ్ అధికారి రామోహన్ తెలిపారు.
previous post