23.7 C
Hyderabad
March 23, 2023 01: 25 AM
Slider తెలంగాణ

త్వరలో విజయ డెయిరీ విస్తరణ

talasani_710x400xt

బడ్జెట్​లో పాడిపరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ శాసనసభలో స్పష్టం చేశారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటు ఇస్తుందని తెలిపారు. డెయిరీల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటు ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. భవిష్యత్తులో విజయడెయిరీ విస్తరణకు నిర్ణయాలు తీసుకున్నట్లు శాసనసభలో వెల్లడించారు. డెయిరీ పాలతో పాటు అనుబంధ ఉత్పత్తులకు ఔట్‌లెట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 4 ప్రోత్సాహకం ఇస్తోందని.. ఆలస్యమైనా ఇస్తామని… సందేహం వద్దని రైతులకు సూచించారు. డెయిరీల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రైవేటు డెయిరీలు కూడా ప్రోత్సాహకం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని… సహకార రంగంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు

Related posts

ధర్మారెడ్డి కుమారుడు మృతి

Murali Krishna

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు

Satyam NEWS

యువగళంపై పాటల సీడీలను ఆవిష్కరించిన చంద్రబాబు

Bhavani

Leave a Comment

error: Content is protected !!